మహాధర్నాను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహాధర్నాను విజయవంతం చేయాలి

Jun 16 2025 7:07 AM | Updated on Jun 16 2025 7:07 AM

మహాధర

మహాధర్నాను విజయవంతం చేయాలి

ధర్పల్లి: హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 17న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాల ని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు బాలయ్య, కారల్‌మార్క్స్‌ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీ నేతలతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు.ఆపరేషన్‌ కగార్‌ పేరిట కొనసాగుతున్న హత్యాకాండను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో నిమ్మల భూమేష్‌ , మ ల్కి సంజీవ్‌,నర్సగౌడ్‌ పాల్గొన్నారు.

ఇందూరు తిరుమలలో

ఘనంగా స్వామి వారి కల్యాణం

మోపాల్‌ : స్వామి వారి కల్యాణం అంటే లోక కళ్యాణం అని, స్వామి వారి కల్యాణం చూస్తేనే సకల పాపాలూ పోతాయని ఆచార్య సంపత్‌ కుమార స్వామి పేర్కొన్నారు. మోపాల్‌ మండలం నర్సింగ్‌ పల్లి ఇందూరు తిరుమల ఆల యంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు తొమ్మిది జంటలకు అవకాశం ఇచ్చి వారితో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన ధర్మ కర్త నర్సింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రోహి త్‌ కుమారాచార్య, నరాల సుధాకర్‌, విజయ్‌, అనిల్‌, నర్సారెడ్డి, పథ్వీ, భాస్కర్‌, సాయిలు, నరేష్‌, మురళి, తదితరులు పాల్గొన్నారు.

ఇస్కాన్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌ రూరల్‌ : సమాజంలో ఇస్కాన్‌ సేవలు అభినందనీయమని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూర్‌ విభాగ్‌ ప్రచారక్‌ నర్రా వెంకటశివకుమార్‌ అన్నారు. ముబారక్‌నగర్‌లోని ఇస్కాన్‌ కేంద్రంలో ఆదివారం జగన్నాథ రథయాత్రకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. జూలై 4వ తేదీన జరిగే జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలన్నారు. భగవద్గీతను, రామాయణ, మహాభారతాలను చదవటమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆచరణ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఇస్కాన్‌ కంఠేశ్వర్‌ అధ్యక్షులు రామానందరాయ ప్రభుదాస్‌, స్వామి యాదవ్‌, ఎండల సుధాకర్‌, రఘు,ఇస్కాన్‌ కేంద్ర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

నగర యాదవ సంఘం

అధ్యక్షుడిగా విక్కీ యాదవ్‌

నిజామాబాద్‌ సిటీ : నగర యాదవ సంఘం అధ్యక్షుడిగా విక్కీ యాదవ్‌ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇంద్రాపూర్‌లోని యాదవ సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా విక్కీయాదవ్‌, గౌరవ అధ్యక్షుడిగా హన్మంతు యాదవ్‌, ప్రధాన కార్యదర్శిగా దేవేందర్‌ యాదవ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలో యాదవ సంఘం అభివృద్ధికి పాటుపడతానని విక్కీయాదవ్‌ తెలిపారు.

పడకంటి రాముకు సన్మానం

నిజామాబాద్‌నాగారం: అమెరికా విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల డాక్టరేట్‌ అందుకున్న పడకంటి రామును ఆదివారం నగరంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న ఇంటిలో నాయకులు సన్మానించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్‌,జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి తక్కూరి దేవేందర్‌, కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుంకెట్‌ రవి, కమ్మర్‌పల్లి మండల ఏఎంసీ డైరెక్టర్‌ మధులత శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల స్థాయి నాయకుడు పేరం సుధాకర్‌ తదితరులున్నారు.

మహాధర్నాను  విజయవంతం చేయాలి 1
1/4

మహాధర్నాను విజయవంతం చేయాలి

మహాధర్నాను  విజయవంతం చేయాలి 2
2/4

మహాధర్నాను విజయవంతం చేయాలి

మహాధర్నాను  విజయవంతం చేయాలి 3
3/4

మహాధర్నాను విజయవంతం చేయాలి

మహాధర్నాను  విజయవంతం చేయాలి 4
4/4

మహాధర్నాను విజయవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement