
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
నిజామాబాద్ నాగారం: విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని డీఈవో పార్శి ఆశోక్ అన్నారు. ఆదివారం వినాయక పద్మశాలి ఐక్య వేదిక (వినాయక నగర్ తర్పా సంఘాల సమూహం)‘ ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెమెంటో, ప్రశంసపత్రం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఐఈవో లోకం రఘురాజ్, జిల్లా సంఘం అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు, నగర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెంట దత్తాద్రి, చౌటి భూమేశ్వర్, ఐక్య వేదిక అధ్యక్షులు గుడ్ల భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి పెంట ధనంజయ్, కోశాధికారి పగిడిమారి యాదగిరి, సలహాదారులు రాపెల్లి గురుచరణం, గుజ్జేటి వెంకట్ నర్సయ్య, చింత శంకర్, ఉపాధ్యక్షులు చింత మురళీధర్, కొండ గంగాచరణ్, సహాయ కార్యదర్శి గజ్జల శంకర్, తదితరులు పాల్గొన్నారు.