
నెరవేరుతున్న సొంతింటి కల
ధర్పల్లి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పైలట్ గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిరుపేద కుటుంబాల సొంతింటి కళను సహకారం చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టింది.
వేగవంతంగా నిర్మాణ పనులు
మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న సీతాయిపేట గ్రామానికి 113 ఇళ్లు మంజూరయ్యాయి. 400 నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటిని నిర్మించాలని నిబంధన మేరకు అధికారులు 55 ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఇందులో 32ఇళ్లు బేస్ మెంట్ వరకు,12 ఇళ్లు రూఫ్లెవెల్ వరకు , మరో రెండు ఇళ్లుకు స్లాబ్ పోయడం పూర్తయింది. 28 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున, రూఫ్ వరకు గోడలు కట్టిన లబ్ధిదారులకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. ఇళ్ల నిర్మాణ పనులను గహ నిర్మాణ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నాలుగు దఫాలుగా బిల్లులు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వెంటనే అధికారులు ఏఐ టెక్నాలజీతో ఫోటోలను అప్లోడ్ చేయగానే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్ష నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. రూఫ్లెవెల్ గోడల వరకు నిర్మాణం పూర్తి చేస్తే రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2 లక్షలు, ప్లాస్టరింగ్, డోర్ ఫిట్టింగ్, కలర్ పూర్తయ్యాక చివరి బిల్లు రూ.లక్ష అందిస్తారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎంత వేగంగా పూర్తి చేస్తే బిల్లులు కూడా అంతే వేగంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్లాబ్ దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు
కొనసాగుతున్న ఇందిరమ్మ
ఇళ్ల నిర్మాణం
పైలట్ ప్రాజెక్టు కింద ధర్పల్లి
మండలం సీతాయిపేట్ ఎంపిక
సకాలంలో బిల్లులు చెల్లింపు
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

నెరవేరుతున్న సొంతింటి కల