
కలెక్టర్ను కలిసిన సీపీ
ఖలీల్వాడి : జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిని సీపీ సాయిచైతన్య శనివారం కలెక్టరేట్ సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించగా.. సీపీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
జిల్లా రెడ్క్రాస్ సేవలు
అభినందనీయం
నిజామాబాద్నాగారం : రాష్ట్రంలో ఎనిమిది రక్తనిధి కేంద్రాలు పని చేస్తుండగా, వాటిలో నిజామాబాద్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్బ్యాంకు సేవలు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ఉచిత సేవలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం రాజ్భవన్లోని సంస్కృతి భవన్లో గవర్నర్ అవార్డులను అందజేశారు. రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందుకు జిల్లా రెడ్క్రాస్కు మూడోసారి ఐఎస్వో సర్టిఫికెట్ దక్కింది. అలాగే 67సార్లు రక్తదానం చేసిన గాదేవార్ గంగాధర్కు గవర్నర్ అవార్డును అందజేశారు. గవర్నర్ ప్రధాన కార్యదర్శి, ఇన్చార్జి చైర్మన్ దాన కిశోర్, సంయుక్త కార్యదర్శి భవానీశంకర్, నిజామాబాద్ జిల్లా చైర్మన్ బుసా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కలిపె రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.40 లక్షలతో పరారీ
ఖలీల్వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని ఓ ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి ఏటీఎంలో డిపాజిట్ చేసే నగదు తీసుకొని పారిపోయినట్లు నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లమ్మగుట్ట వద్ద ఉన్న ప్రయివేటు ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో డబ్బులను డిపాజిట్ చేస్తారు. శనివారం ఉదయం విధులకు వచ్చిన న్యాల్కల్ రోడ్కు చెందిన రమాకాంత్ రూ.40 లక్షల 50 వేలు ఏజెన్సీ వద్ద ఉన్న వాహనంలో పెడుతుండగా ఎత్తుకొని పరారైనట్లు చెప్పారు. రమాకాంత్ ఎత్తుకెళ్లిన డబ్బులను బోధన్లోని ఓ బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుర్తింపు లేని ప్రైవేట్ కళాశాలల్లో చేరొద్దు
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అఫ్లియేషన్ గుర్తింపు ఉందా లేదా అని స్పష్టంగా తెలుసుకొని మాత్రమే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అఫ్లియేషన్ లేని జూనియర్ కళాశాలల్లో చేరిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
నీట్లో జిల్లా
విద్యార్థులకు ర్యాంకులు
నిజామాబాద్ అర్బన్: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు జాతీయ ర్యాంకులు సాధించారు. నగరంలో ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన రాథోడ్ కార్తిక్ 1623, జే అన్విక 1970, రాథోడ్ స్నేహ 3646 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

కలెక్టర్ను కలిసిన సీపీ

కలెక్టర్ను కలిసిన సీపీ

కలెక్టర్ను కలిసిన సీపీ

కలెక్టర్ను కలిసిన సీపీ