
150 మంది పిల్లలకు డాడీ
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం తరఫున అనాథ బాల, బా లికల కోసం డిచ్పల్లి మండల కేంద్రంలో 17 ఫిబ్రవరి 2016లో ‘మానవతసదన్’ ను ప్రారంభించారు. అప్పటి జిల్లా కలెక్టర్ యోగితారాణా ప్రత్యే క శ్రద్ధతో మానవతసదన్ ఏర్పాటుకు కృషి చేశారు. 14 మంది పిల్లలతో ప్రారంభమైన సదన్లో ప్రస్తుతం 150 మంది పిల్లలు (బాలురు 48, బాలికలు 102 మంది) ఉన్నారు. మానవతసదన్కు చైర్మన్గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. లైజనింగ్ ఆఫీ సర్గా పి.సుధాకర్రావు, కేర్టేకర్గా ఉపాధ్యాయుడు అందె రమేశ్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న రమేశ్ 24 గంటలూ పిల్లల బాగోగులను పర్యవేక్షిస్తుంటారు. అనాథ పిల్లలను తన సొంత బిడ్డలుగా భావించి వారిని ఆదర్శవంతులుగా, ఉ న్నత స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. కొందరు పిల్లలు ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్, బీటెక్, హార్టికల్చర్ కోర్సులు చదువుతున్నారు. వారికి ఆయా కళాశాలల్లో ఫీజులు చెల్లించడానికి దాతలు సహకరిస్తున్నారు. దాతలు దొరకని సమయంలో వారి కళాశాల, హాస్టల్ ఫీజులు కేర్టేకర్ రమేశ్ చెల్లిస్తూ వారి ఉన్నత చదువులకు అండగా ఉంటూ తండ్రి లేని లోటును తీరుస్తున్నారు. మావనతసదన్లోని పిల్లలందరూ రమేష్ను ‘డాడీ’ అని ప్రేమగా పిలుస్తారు. ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఆయన సతీమణి సహకారం కూడా ఎంతో ఉంది.
అనాథ పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతూ..
తండ్రి పాత్ర పోషిస్తున్న
మానవతసదన్ కేర్టేకర్ రమేష్
నా బిడ్డలుగా భావిస్తా
పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తే పాఠా లు బోధించే వరకే బాధ్య త ఉంటుంది. మానవతసదన్లో పని చేస్తే ఇక్కడ ఉండే అనాథ పిల్లలను నా సొంత బిడ్డలుగా భా వించి తండ్రి పాత్ర పోషించే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ సహకారంతో పిల్లలను వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివించేందుకు వీలుకలుగుతుంది.
– అందె రమేశ్, మానవతసదన్ కేర్టేకర్

150 మంది పిల్లలకు డాడీ