ఒకరు ఎంబీఏ.. మరొకరు ఎంఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకరు ఎంబీఏ.. మరొకరు ఎంఎస్‌

Jun 15 2025 7:18 AM | Updated on Jun 15 2025 7:18 AM

ఒకరు ఎంబీఏ.. మరొకరు ఎంఎస్‌

ఒకరు ఎంబీఏ.. మరొకరు ఎంఎస్‌

బోధన్‌: బోధన్‌ మండలం ఏరాజ్‌పల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు అయిల దేవిదాస్‌గౌడ్‌ తన కూతుళ్లు ప్రత్యూష, ప్రణీతను ఉన్నత చదువులు చదివించారు. వృత్తి పనిలో అరకొర ఆదాయం ఉన్నా ఏనాడూ ఆ ప్రభావం పిల్లల చదువులపై పడ కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన ప్రోత్సాహంతో పెద్ద కూతురు ప్రత్యూష బోధన్‌లోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ), ఎంబీఏ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు ప్రణీత బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసింది. అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసింది. నాన్న ప్రోత్సాహంతోనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్లామని ఆ అక్కాచెల్లెళ్లు అంటున్నారు.

తండ్రి దేవిదాస్‌గౌడ్‌తో కూతుళ్లు ప్రత్యూష, ప్రణీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement