
ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి
డిచ్ పల్లి : వీలైనంత త్వరగా ఉపాధి కూలీలకు సంబంధించి ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని, సోషల్ ఆడిట్లో వచ్చిన ఆరోపణలను త్వరగా పరిష్కరించాలని డిచ్పల్లి ఎంపీడీవో బూక్య లింగం నాయక్ ఆదేశించారు. శుక్రవారం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో ఏర్పా టు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు కురుస్తున్నందున వనమహోత్సం కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం గ్రామ నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను తప్పకుండా నిర్మించుకునేలా చూడాలన్నారు. ఇంకుడు గుంత, మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నెల 17న పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి హామీ పనులపై మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈజీఎస్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సుధాకర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు ఉమేష్ కుమార్, పరమేశ్వర్, సాయికుమార్, అరుంధతి, కంప్యూటర్ ఆపరేటర్లు అన్నపూర్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు.