
చిగురిస్తున్న ఆశలు!
భూభారతితో
మోర్తాడ్(బాల్కొండ): ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న భూముల సమస్యలు భూభారతి గ్రామ సభల లో స్వీకరిస్తున్న దరఖాస్తులతో పరిష్కారం దొరుకుతుందని దరఖాస్తుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమలు చేసిన ధరణి వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించలేదని, భూభారతి వల్ల తమకు పట్టాలు లభిస్తాయనే నమ్మకంతో వినతి పత్రాలు ఇస్తున్నారు. మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, ఏర్గట్ల తదితర మండలాల్లో భూభారతి గ్రామసభల నిర్వహణ సాగుతోంది.
ఈనెల 20 వరకు గ్రామసభలు సాగనున్నా యి. గ్రామసభలు ముగిసిపోయిన తర్వాతనే తమ కు అందిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలన చేయనున్నా రు. అనంతరం భూముల సమస్యలకు ఒక పరిష్కా రం లభించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా ధరణి అమలులో ఉన్న సమయంలో తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపించేవారు. ఈసారి కూడా మండల స్థాయిలో ఆప్షన్ ఇవ్వకపోవడంతో గతంలో మాదిరిగానే ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపించాల్సి ఉంటుంది. రెవెన్యూ ఉద్యోగుల తప్పిదాల వల్ల పట్టా పాసుపుస్తకాలు అందుకోలేని వాళ్లు మండల స్థాయిలోనే కొత్త పట్టా బుక్కులు తీసుకునేలా సవరణ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఆప్షన్లలో మార్పు లేకపోయినా గతంలో కంటే వేగంగానే ఫైళ్లు కదలడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో గ్రామంలో 50 నుంచి 80 వరకూ భూ సమస్యలకు సంబంధించి వినతి ప త్రాలు అధికారులకు అందుతున్నాయి. భూభారతి పోర్టల్ను పూర్తి స్థాయిలో అమలు చేసిన నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.
ధరణిలో సాంకేతిక కారణాలతో పేరుకుపోయిన సమస్యలు
భూభారతి ద్వారా పరిష్కారం కావొచ్చనే ధీమాలో
భూ యజమానులు
ఈనెల 20 వరకు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం
భూ సమస్యల పరిష్కారానికి అవకాశం

చిగురిస్తున్న ఆశలు!