
ఇక అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి రానుంది. అవసరమున్న ప్రాంతాల్లో వేగంగా టీవీ యూనిట్లను బిగిస్తున్నారు. మొన్నటి వరకు మండలానికి ఒకటి చొప్పున 31 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా, ప్రస్తుతం మూడో విడతలో 49 రైతు వేదికల్లో కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 106 రైతు వైదికలకు గాను ఇప్పటి వరకు 80 వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి వచ్చింది. మిగతా రైతు వేదికల్లో కూడా ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వం ప్రతి మంగళవారం రైతులకు సాగులో సలహాలు, సూచనలు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఏఈవోలు, ఏవోలపై భారం
నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను ఉపయోగంలోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఐతే, వీటి ని ర్వహణకు మాత్రం నిధులు ఇవ్వడం లేదు. జిల్లా లోని 106 రైతుల వేదికలకు రెండేళ్ల క్రితం రూ.9 వే ల చొప్పున ఐదు నెలలకు నిధులు ఇచ్చింది. అప్ప టి నుంచి మళ్లీ నిధులు ఇవ్వకపోవడంతో ఏఈవో లు, ఏవోలపై భారం పడుతోంది. ఇప్పుడు వీడి యో కాన్ఫరెన్స్ అందుబాటులోకి రావడంతో దాని నిర్వహణ, ఇంటర్నెట్ ఖర్చులు కూడా అదనం అ య్యాయి. టీజీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో వ్యవసాయాధికారులు తమ ఫోన్ల వైఫై ద్వారా వీడియో కాన్ఫరెన్స్లను నడిపిస్తున్నారు.
ఇప్పటి వరకు 80 ప్రాంతాల్లో
ఏర్పాటు చేసిన అధికారులు
నిర్వహణకు నిధులు మాత్రం
ఇవ్వని సర్కారు
నిధులు కోరుతాం..
అన్ని రైతు వేదికల్లో వీడి యో కాన్ఫరెన్స్ సౌకర్యం క ల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇ ది రైతులకు ఎంతో ఉపయోగకరం. అలాగే రైతు వేదికల నిర్వహణకు నిధులు రావడం లేదనే విషయం వాస్తవమే. నిధుల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరయ్యేలా చూస్తాం.
– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

ఇక అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్