
సరికొత్త హంగులతో..
మాక్లూర్ : మాక్లూర్ మండలంలోని మాణిక్బండార్, అమ్రాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక అలంకరణలు చేశారు. మానిక్బండార్లో ‘మన ఊరు – మన బడి’ కింద తరగతి గదులతో పాటు పాఠశాల అంతటికీ రంగులు వేశారు. 200 మంది విద్యార్థుల సంఖ్య ఉన్న ఈ పాఠశాల ఉత్తీర్ణతలోనూ ముందుంటోంది. పాఠశాల ఆవరణలో తాగునీటి కులాయిల వద్ద, మరు గుదొడ్లను ముందస్తుగా శుభ్రం చేయించారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, సురేశ్ తెలిపారు.
మరింత బలోపేతం చేస్తాం
ప్రైవేట్ పాఠశాలలకు దీటు గా పాఠశాలల్లో విద్య అందుతోంది. తల్లిదండ్రులు త మ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించడానికి మొగ్గు చూపుతున్నారు. వా రి నమ్మకాన్ని వమ్ము చేయం. – కె. సత్యనారాయణ, ఎంఈవో, మాక్లూర్
మాణిక్బండార్ ప్రభుత్వ పాఠశాల

సరికొత్త హంగులతో..