14న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

14న జాతీయ లోక్‌ అదాలత్‌

Jun 11 2025 11:46 AM | Updated on Jun 11 2025 11:46 AM

14న జాతీయ లోక్‌ అదాలత్‌

14న జాతీయ లోక్‌ అదాలత్‌

నిజామాబాద్‌ లీగల్‌: ఈనెల 14న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్‌ భరతలక్ష్మి తెలిపారు. జిల్లా కోర్టులో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌, మోటార్‌ వాహన బీమా, మున్సిపల్‌, పీఎల్‌సీ, కుటుంబ తగాదాలు, చెక్‌ బౌన్స్‌లకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవాలన్నారు.

పట్టుదలకు పోకుండా పట్టువిడుపులతో తమ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ చక్కని మార్గమన్నారు. కేసుల పరిష్కారం కోసం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ప్రత్యేక బెంచులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement