
నాణ్యమైన భోజనం అందించాలి
మోపాల్: మధ్యాహ్న భోజనం తయారీ, పంపిణీలో హెచ్ఎంలు, ఏజెన్సీలు సమన్వయం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు. నగరశివారులోని బోర్గాం(పి) జి ల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నభోజనంపై ఒకరోజు శిక్షణను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఏజె న్సీల నిర్వాహకులు, హెచ్ఎంలకు సూచించా రు. వంట పాత్రలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదన్నారు. కోర్సు డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో పరిశుభ్రత పాటి స్తూ నాణ్యమైన భోజనం తయారు చేయాలని అన్నారు. పరిశుభ్రత పాటించే విధానాలపై రిసోర్స్ పర్సన్లు లింగన్న, సురేశ్ వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజనం వండే విధానాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లాలోని 80 మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, 80 మంది కుక్ అండ్ హెల్పర్లు పాల్గొన్నారు.