పగలు.. 13 గంటలు! | - | Sakshi
Sakshi News home page

పగలు.. 13 గంటలు!

Jun 22 2025 3:20 AM | Updated on Jun 22 2025 3:20 AM

పగలు.. 13 గంటలు!

పగలు.. 13 గంటలు!

● శనివారం జిల్లాలో సుదీర్ఘ పగలు.. ● ‘వేసవి ఆయానంతం’గా పేర్కొంటారన్న నిపుణులు

నిర్మల్‌ లో శనివారం సాయంత్రం 6:50 గంటలకు సూర్యుని వెలుతురు

సుదీర్ఘ పగలుకు కారణం ఇదే..

సాధారణంగా భూమి 23.5 డిగ్రీల వంపు తిరిగి సూర్యుడు చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఈ సమయంలోనే వేసవి ఆయనాంతం ఏర్పడుతుంది. సాధారణంగా జూన్‌ 21 రోజునే భూమి ఉత్తరార్థ గోళం సూర్యుడికి సమీపంగా రావడం వల్ల సూర్యుని కాంతి భూమిపై మరింత ఎక్కువ కాలం కేంద్రీకృతం అవుతుంది. దీంతో పగలు ఎక్కువగా ఉంటుంది.

నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో జూన్‌ 21న శనివారం ప్రత్యేకత సంతరించుకుంది. సాధారణంగా రోజుకు 24 గంటలు ఉంటాయని తెలుసు. అందులో 12 గంటల సమయం పగలు, ఉంటే మరో 12 గంటలు రాత్రి. సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకారం పగలు రాత్రి వ్యవధుల్లో చాలా సందర్భాల్లో కాస్త తేడా ఉండటం సహజమే. అయితే శనివారం రోజున మాత్రం జిల్లాలో పగటి సమయం గణనీయంగా పెరిగింది. సాయంత్రం 6:40 దాటిన సూర్యుడు అస్తమించలేదు. పగలు సుదీర్ఘంగా ఉండటం అనే దృగ్విషయాన్ని ‘వేసవి ఆయనాంతం’గా వ్యవహరిస్తారని నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన భౌతికశాస్త్ర నిపుణులు రాఘవేంద్రవర్మ తెలిపారు. జిల్లాలో శనివారం ఉదయం 5:24 గంటలకు సూర్యోదయం కాగా, సూర్యాస్తమయం 7:09 గంటలకు జరిగింది. అంటే దాదాపు 13 గంటలకు పైగా పగలు ఉంది. ఇది ఖగోళశాస్త్రంలో ప్రత్యేకమైన రోజుగా వ్యవహరిస్తారని, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా భిన్నత్వాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement