సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి

Jun 22 2025 3:20 AM | Updated on Jun 22 2025 3:20 AM

సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి

సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి

● డీపీవో శ్రీనివాస్‌

నర్సాపూర్‌(జి): సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్‌ ఆదేశించారు. మండలంలోని నర్సాపూర్‌(జి), కుస్లి గ్రామాల్లోని పారిశుద్ధ్య పనులు, సెగ్రిగేషన్‌ షెడ్‌, శ్మశానవాటిక, అంగన్‌వాడీ కేంద్రాలు, నర్సరీలను శనివారం పరిశీలించారు. సేంద్రియ ఎరువులు తయారుచేసి రైతులకు అమ్మి గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని సూచించారు. వన మహోత్సవానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. డీపీవో వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాథోడ్‌ కై లాస్‌, కృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement