ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సాధన కమిటీ కన్వీనర్‌గా రామయ్య | - | Sakshi
Sakshi News home page

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సాధన కమిటీ కన్వీనర్‌గా రామయ్య

Jun 22 2025 3:20 AM | Updated on Jun 22 2025 3:20 AM

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సాధన కమిటీ కన్వీనర్‌గా రామయ్య

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సాధన కమిటీ కన్వీనర్‌గా రామయ్య

ఖానాపూర్‌: యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సాధన కమిటీ కన్వీనర్‌గా నంది రామయ్యను అఖిలపక్ష నాయకులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని అర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సాగి లక్ష్మణ్‌రావు, కోకన్వీనర్లుగా ఆకుల శ్రీనివాస్‌, బీసీ రాజన్న, కొండాడి గంగారావు, ప్రధాన కార్యదర్శిగా కాశవేణి ప్రణయ్‌, కోశాధికారిగా ఎనగందుల నారాయణ, ముఖ్య సలహాదారులుగా కొక్కుల ప్రదీప్‌, పడాల రాజశేఖర్‌, గౌరికార్‌ రాజు, శనిగారపు శ్రావణ్‌, పుప్పాల ఉపేందర్‌ ఎన్నికయ్యారు.

అదనపు కలెక్టర్‌కు వినతి..

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ను జిల్లా కేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇప్పటికే పలుశాఖలకు కేటాయించిన స్థలాల్లో ఆయా శాఖల కార్యాలయాలు మంజూరుకాలేదని గుర్తు చేశారు. ఆ స్థలాలను రద్దు చేసి ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు కేటాయించాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement