
ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
● జిల్లా జడ్జి శ్రీవాణి
భైంసాటౌన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబి రం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాధిక, బైంసా కోర్టు జడ్జి డి.దేవేంద్రబాబుతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అ నంతరం శ్రీవాణి మాట్లాడుతూ.. వివిధ రంగా ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజలు తరచూ ఆ రోగ్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. అనంతరం భైంసా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఇతర వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, పట్టణ వైద్యులు, న్యాయవాదులు, కోర్టు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.