Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం | Huge Number Of Devotees At Uttar Pradesh Ayodhya Ram Mandir Janmotsav Celebrations, More Details Inside | Sakshi
Sakshi News home page

Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం

Apr 6 2025 12:03 PM | Updated on Apr 6 2025 1:15 PM

Uttar Pradesh Ayodhya Ram Mandir Janmotsav Celebrate

అయోధ్య: నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు(Sri Ramanavami celebrations) అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తుల సందడితో కళకళలాడుతున్నాయి. శ్రీరాముడు జన్మించిన యూపీలోని అయోద్యలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామదర్బారుకు ఈ రోజు ఉదయానికే ఐదు లక్షల మంది భక్తులు చేరుకున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాలక్‌ రాముణ్ణి దర్శించుకునే వేళలను పొడిగించారు. ఈరోజు బాలరాముడు భక్తులకు 18 గంటలపాటు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 5 గంటలకు తెరుచుకున్న ఆలయ తలుపులు రాత్రి 11 గంటల వరకూ తెరచివుంచనున్నారు. వీవీఐపీ దర్శనాలను(VVIP visits) కూడా నిలిపివేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య వంశస్థుడైన శ్రీరామునికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్దనున్నాడు. (ఆ సమయంలో సూర్య కిరణాలు శ్రీరాములవారి నుదుటను తాకనున్నాయి)

ఈ  అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ ట్రస్ట్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని సుమారు ఎనిమిది వేల ఆలయాలు, మఠాలను శ్రీరామనవమి సందర్భంగా అందంగా తీర్చి దిద్దారు. రామనగరి అయోధ్యలో ఈరోజు సాయంత్రం సరయూ తీరంలో రెండున్నర లక్షల దీపాలను వెలిగించనున్నారు.

ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్‌ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement