సీఎం పినరయి విజయన్‌ నివాసానికి బెదిరింపులు | Threat to Kerala CM Pinarayi Vijayan's Official Residence | Sakshi
Sakshi News home page

సీఎం పినరయి విజయన్‌ నివాసానికి బెదిరింపులు

Sep 8 2025 3:55 PM | Updated on Sep 8 2025 4:11 PM

Threat to Kerala CM Pinarayi Vijayan's Official Residence

తిరువనంతపురం: కేరళలో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఓ అగంతకుడు రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో బాంబుల్ని ఏర్పాటు చేసినట్లు బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్‌ రంగంలోకి దిగింది.

సోమవారం ఉదయం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం జిల్లా కోర్టుకు అధికారిక ఈ-మెయిల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. సీఎం పినరయి విజయన్‌తో పాటు తిరువనంతపురం జిల్లా కోర్టులో బాంబును పెట్టామనేది ఆ మెయిల్‌ సారాంశం. సీఎం పినరయి విజయన్‌ అధికారిక నివాసం,జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో 

బాంబు డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ (బీడీడీఎస్‌) జాగిలాలతో మోహరించింది. కోర్టు లోపల, పరిసర ప్రాంతాలు, సీఎం అధికారిక నివాసంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కోర్టు అధికారిక మెయిల్‌కు బాంబు బెదిరింపులు మెయిల్స్‌ పంపిన  అగంతకుడిని గుర్తిస్తామని అన్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

28సార్లు బాంబు బెదిరింపులు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేరళ రాష్ట్రానికి 28 సార్లు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. సీఎం పినరయి విజయన్‌ అధికారిక నివాసంతో పాటు రాజ్‌భవన్‌,ఎయిర్‌పోర్టు,కోర్టులలో బాంబులను అమర్చామని మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు అధికారికంగా విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement