చార్‌ధామ్‌ యాత్రలో సరికొత్త రికార్డులు | Something Special In Char Dham Yatra 2024, Know About New Records Inside | Sakshi
Sakshi News home page

చార్‌ధామ్‌ యాత్రలో సరికొత్త రికార్డులు

Jul 2 2024 9:14 AM | Updated on Jul 2 2024 10:39 AM

Something Special in Char Dham Yatra 2024

డెహ్రాడూన్‌: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్‌ధామ్‌ యాత్ర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మే 10న ఈ యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించుకున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌ ఆలయాలను మే 10న తెరిచారు. మే 12న బద్రీనాథ్‌ తలుపులు తెరిచారు.

గత ఏడాది ఏప్రిల్‌ 22న చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కాగా 2023, జూన్‌ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి 50 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. చార్‌ధామ్‌లలో ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 10 లక్షల ఆరు వేలమంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది దర్శించుకున్నారు.

గంగోత్రిని ఇప్పటివరకూ నాలుగు లక్షల 98వేల మంది దర్శించుకున్నారు. అలాగే యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించుకున్నారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డులు దాటవచ్చనే అంచనాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement