ఆపరేషన్‌ సిందూర్‌పై రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు | Pm Modi Surrendered After Trump Call: Rahul | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌పై రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు

Jun 3 2025 6:47 PM | Updated on Jun 3 2025 7:31 PM

Pm Modi Surrendered After Trump Call: Rahul

భోపాల్: ఆపరేషన్‌ సిందూర్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన భోపాల్‌లోని రవీంద్ర భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. ట్రంప్‌ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని.. నరేందర్‌.. సరెండర్‌ అనగానే భయపడ్డారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారంటూ మండిపడ్డారు. 1971 సంక్షోభ సమయంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్ణయాత్మక వైఖరిని ప్రస్తావిస్తూ... ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదన్నారు. యూఎస్ సెవెంత్ ఫ్లీట్ ముందుకు సాగినప్పుడు ఆమె నేను చేయవలసినది చేస్తానంటూ గట్టిగా చెప్పారంటూ రాహుల్‌ గుర్తు చేశారు.

సరెండర్‌ కావడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు అలవాటే అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వారికి లొంగిపోయే లేఖలు రాసే అలవాటు ఉందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ లొంగిపోదు. గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ పటేల్‌.. వీరు లొంగిపోయే వ్యక్తులు కాదు, అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులు ’’ అంటూ రాహుల్‌ చెప్పుకొచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement