రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్‌..కోర్టులో నో రిలీఫ్‌ | Kejriwal Interim Bail Extension Judgement Reserved | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ లొంగిపోవాల్సిందే.. కోర్టులో నో రిలీఫ్‌

Jun 1 2024 5:44 PM | Updated on Jun 1 2024 6:48 PM

Kejriwal Interim Bail Extension Judgement Reserved

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. జూన్‌ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్‌2) తీహార్‌ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

లిక్కర్‌ స్కామ్‌ కేసులో  మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. 

జూన్‌ 2న కేజ్రీవాల్‌ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్‌ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి  బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్‌ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్‌1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్‌ మధ్యంత బెయిల్‌ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement