హుబ్లీ: ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ప్రేమపేరుతో లోబర్చుకుని షికార్లకు వెళ్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఆరోపణలతో ప్రొఫెసర్ దేవరాజన్ తంగదొరైపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఓ విద్యార్థినితో సంబంధం ఉన్నట్లు రుజువు కావడంతో వీసీ సస్పెండ్ చేశారు.
అంతకు ముందు ఏబీవీపీ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా చేసి పూల కుండీలను పగలగొట్టారు. నిందితుడు పీహెచ్డీ విద్యారి్థనితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అతని పోరు పడలేక ఆమె పీహెచ్డీని వదిలేసి వెళ్లిపోయినా చిరునామా కనుక్కుని మరీ వేధించసాగాడు. ఇతని నిర్వాకంతో యూనివర్సిటీ పరువు పోయిందని విద్యార్థులు ఆరోపించారు.


