Narendra Modi: ‘బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం’ | India committed to elevating ties with UK says Narendra Modi | Sakshi
Sakshi News home page

Narendra Modi: ‘బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం’

Jul 25 2024 6:36 AM | Updated on Jul 25 2024 9:26 AM

India committed to elevating ties with UK says Narendra Modi

న్యూఢిల్లీ: బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఖరారు చేసుకోవాలనే బ్రిటన్‌ ఆకాంక్షను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

 రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచి్చన బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ లామీ బుధవారం ప్రధాని మోదీని కలిశారు. భారత్‌– యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం, బలోపేతం చేసుకోవడానికి బ్రిటన్‌ నూతన ప్రధాని కియర్‌ స్టార్మర్‌ ప్రాధాన్యమివ్వడాన్ని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement