ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రోబోల సాయంతో మంటలు అదుపులోకి.. 

Fire Beaks Out In Slums Near Sultanpuri Road At Delhi - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, రోబోల సాయంతో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.

కాగా, అగ్నిప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా డివిజన్‌ అగ్నిమాపక శాఖ అధికారి ఏకే జైస్వాల్‌ మాట్లాడుతూ.. ప్రమాద స్థలానికి 15 ఫైర్‌ ఇంజిన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. మంటలను ఆర్పేందుకు రోబోలను కూడా ఉపయోగిస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top