చేపలు కొంటే.. లీటరు పెట్రోల్‌ ఫ్రీ | Sakshi
Sakshi News home page

Free Petrol: చేపలు కొంటే.. లీటరు పెట్రోల్‌ ఫ్రీ

Published Tue, Aug 3 2021 6:51 AM

Business Man Offers Petrol Free Of Cost For Fish Buying In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: చేపలు కొంటే లీటరు పెట్రోల్‌ ఉచితం అంటూ మదురైలో ఓ వ్యాపారి చేసిన ప్రకటనతో జనం క్యూ కట్టారు. మదురై బీబీ కులంలో అతి పెద్ద చేపల దుకాణం ఉంది. ఈ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పెరిగిన పెట్రోల్‌ ధరను దృష్టిలో ఉంచుకుని రూ.500లకు పైగా చేపలను కొంటే లీటరు పెట్రోల్‌ ఉచితం అంటూ దుకాణం ముందు బోర్డు పెట్టాడు. దీంతో ఆదివారం నుంచి ఈ దుకాణానికి జనం పోటెత్తారు. చేపలు కొన్న వారికి పెట్రోల్‌ కోసం కూపన్లు అందజేశారు.

Advertisement
Advertisement