
ఖర్చు పెరిగింది..
పెరిగిన ధరలతో ఎకరా వరిసాగుకు రూ. 30వేలకు పైగా ఖర్చు అవుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు అప్పులు తప్పడం లేదు. పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలుచేసి.. అదనంగా రూ. 500 బోనస్ ఇస్తుందనే ధైర్యంతో వరిసాగు చేస్తున్నాం.
– వెంకట్రెడ్డి, రైతు, పూసల్పహాడ్
సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం..
జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతేడాది కంటే ఈ సారి 10వేల ఎకరాల్లో అదనంగా సాగవుతుందని అంచనా వేస్తున్నాం. ప్రభుత్వం బోనస్ అందిస్తుండటంతో రైతులు వరిసాగుపై మక్కువ చూపుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు వేసుకునే అవకాశం ఉంది.
– జాన్సుధాకార్, డీఏఓ
●