
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
మాగనూర్: రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు విక్రయించాలని, నిషేధిత విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయించినట్లు విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. పురుగు మందుల నాణ్యత, సిడ్స్, ఫర్టిలైజర్ షాపులో స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్ తదితర రికార్డ్స్ను తనిఖీ చేశారు. కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుల మందులపై ఆరా తీశారు. రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏ షాపుల్లో కొనుగోలు చేసినా తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏడిఏ మక్తల్ నగేష్ కూమార్, మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.