
విరివిగా మొక్కలు నాటి కాపాడాలి
నారాయణపేట: వన మహోత్సవంలో భాగంగా ప్రతి శాఖ తమ పరిధిలో మొక్కలు నాటి కాపాడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం వన మహోత్సవంపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 3.87 లక్షల మొక్కలు పెంచాలన్నారు. వివిధ శాఖలకు 15.41 లక్షల మొక్కల టార్గెట్ నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. శాఖల వారీగా అగ్రికల్చర్ 0.86 పశుసంవర్ధక శాఖ 0.01, డీఆర్డీఓ 8.66, ఎలక్ట్రికల్ 0.01, ఎకై ్సజ్ 0.25, ఫారెస్ట్ 0.43, హార్టికల్చర్ 1.23 లక్షల మొక్కలు నాటి పెంచాలని ఆదేశించారు.
● ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 45 మంది కలెక్టర్కు ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
● జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయ సమావేశ హాల్ను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ చాలా కీలకమైందని.. అన్ని కార్యక్రమాల్లో లక్ష్యాల పరంగా పురోగతి సాధించాలని సూచించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్ఓ కె.జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ, డీపీఓ భిక్షపతి, సబ్ యూనిట్ అధికారి అశోక్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారులు విజయ్ కుమార్, గోవిందరాజు, ఫార్మసిస్ట్ సూర్యకాంత్రెడ్డి, డీడీఎం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.