ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

Jun 17 2025 6:47 AM | Updated on Jun 17 2025 6:47 AM

ప్రభు

ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

నాకు ఐదెకరాల పొలం ఉంది. పంట పెట్టుబడులు పెట్టే సమయంలో ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు అందించడం సంతోషంగా ఉంది. రైతులకు కొంత భారం తగ్గుతుంది. ఇందుకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కొడంగల్‌ నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.

– అల్లీ వెంకటయ్య, రైతు, కొత్తపల్లి

సంతోషంగా ఉంది..

వానాకాలం పంటల సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పంట పెట్టుబడికి ప్రభుత్వం అందించే డబ్బులు ఉపయోగపడతాయి. ఈ డబ్బులతోనే పనులు మొదలుపెడతాం.

పి.నర్సింహులు, రైతు, మాగనూర్‌

1,78,017 మందికి లబ్ధి..

జిల్లావ్యాప్తంగా 1,78,017 మందికి రైతుభరోసా కింద వానాకాలం పెట్టుబడి సాయం రూ. 257కోట్లు జమ కానున్నాయి. ప్రభుత్వం సోమవారం నుంచి రైతుభరోసా అందిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన రైతులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

– జాన్‌సుధాకర్‌, డీఏఓ

ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. 
1
1/1

ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement