
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
నాకు ఐదెకరాల పొలం ఉంది. పంట పెట్టుబడులు పెట్టే సమయంలో ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు అందించడం సంతోషంగా ఉంది. రైతులకు కొంత భారం తగ్గుతుంది. ఇందుకు కృషిచేసిన సీఎం రేవంత్రెడ్డికి కొడంగల్ నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– అల్లీ వెంకటయ్య, రైతు, కొత్తపల్లి
సంతోషంగా ఉంది..
వానాకాలం పంటల సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పంట పెట్టుబడికి ప్రభుత్వం అందించే డబ్బులు ఉపయోగపడతాయి. ఈ డబ్బులతోనే పనులు మొదలుపెడతాం.
పి.నర్సింహులు, రైతు, మాగనూర్
1,78,017 మందికి లబ్ధి..
జిల్లావ్యాప్తంగా 1,78,017 మందికి రైతుభరోసా కింద వానాకాలం పెట్టుబడి సాయం రూ. 257కోట్లు జమ కానున్నాయి. ప్రభుత్వం సోమవారం నుంచి రైతుభరోసా అందిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన రైతులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
– జాన్సుధాకర్, డీఏఓ
●

ప్రభుత్వానికి కృతజ్ఞతలు..