
పత్తి విత్తనాల ధర తగ్గించాలి
ఎకరాకు పత్తి విత్తనాలు మూడు పాకెట్లు అవసరం కాగా పెరిగిన ధరలతో వాటికి రూ.3,030 ఖర్చువుతుంది. ఇలా వ్యవసాయనికి సంబందించిన ప్రతి వస్తువు పెరిగితే రైతులకు నష్టాలు తప్ప లాభాలు రావు. పెరిగిన పత్తి విత్తనాల ధరలను తగ్గించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.
– పాపన్న, పత్తి రైతు, మరికల్
ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి
వాణిజ్య పంటల విత్తనాల ధరల ప్రభుత్వ నియంత్రణ ఉంటే బాగుటుంది. తక్కువ ధరకు దొరుకుతాయని లూజుగా తీసుకుని సాగు చేస్తే సరైన దిగుబడి రాక నష్టపోతున్నాం. అన్ని రకాల విత్తనాల ధరలు నియంత్రణలో ఉంచే రైతులకు గిట్టుబాటు అవుతుంది. పెరిగిన కూలీలతో సత్తమతం అవుతుంటే విత్తనాల ధరలు పెరగడం తమను బాధిస్తోంది.
– వెంకటన్న, రైతు, మాధవరం
విత్తనాలనుపొదుపుగా వాడాలి
పెరుగుతున్న విత్తన ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి దూరం, దూరం విత్తనాలు నాటితే పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దగ్గరగా నాటితే ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. ఇలా చేయడం వల్ల ఎకరాకు ఒక ప్యాకెట్ను తగ్గించుకోవచ్చు. పెరిగిన విత్తనాల ధరల విషయం తమ చేతుల్లో ఏమి లేదు.
– రహ్మన్, ఏఓ, మరికల్
●

పత్తి విత్తనాల ధర తగ్గించాలి