
ప్రభుత్వానికి ధన్యవాదాలు
బీసీలు రిజర్వేషన్ల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కామారెడ్డి ప్రకటనకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీఓ తేవడం హర్షించదగ్గ విషయం. ఆ జీఓ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. ఎవరూ కోర్టుకు వెళ్లకముందే షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి. విద్యా, ఉద్యోగుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
– చక్రహరి రామరాజు,
బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు