
ఉపాధ్యాయులకు పదోన్నతులు
నల్లగొండ : ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం.. అందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొమ్మిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఆరేళ్ల తర్వాత బదిలీలను గత సంవత్సరం నిర్వహించారు. ఆ తరువాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల ద్వారా ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. జూలై మాసం పూర్తి కావొస్తున్నందున ముందుగా పదోన్నతుల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. ఆ జాబితాపై బుధ, గురువారాలో అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.. సంవత్సర కాలంలోనే మళ్లీ పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ సన్నద్ధం కావడంతో ఉపాధ్యాయుల్లో ఆనందం నెలకొంది.
ఖాళీల ఆధారంగా..
జిల్లా పరిధిలో ఎస్జీటీలకు, మల్టీజోన్న్–2 పరిధిలో గెజిటెడ్ (జీహెచ్ఎం) ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. జిల్లాలో మొత్తంగా వివిధ కేటగిరిల్లో 304 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో జీహెచ్ఎంల ఖాళీలు 54 కాగా.. మిగతావి స్కూల్ అసిస్టెంట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితా సైతం రూపొందిస్తున్నారు. జూన్న్30వ తేదీ వరకు ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 304 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి.
ఫ ఏడాది కాలంలోనే
రెండోసారి అవకాశం
ఫ ఆన్లైన్లో సీనియారిటీ జాబితా
ఫ అభ్యంతరాలు స్వీకరిస్తున్న విద్యాశాఖ
ఫ జిల్లాలో 304 మంది ప్రమోషన్
పొందే అవకాశం
త్వరలో షెడ్యూల్
ప్రస్తుతం పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు ప్రక్రియ మొదలుపెట్టారు. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ సైతం విడుదల కానుండడంతో విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సీనియారిటీతో పాటు వివిధ కేటగిరిల్లో ఖాళీలను గుర్తిస్తున్నారు. షెడ్యూల్ వెలువడితే 15 నుంచి 20 రోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పదోన్నతులు, బదిలీలు ఇప్పుడు చేపడితే విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.