రాజ్యాంగాన్ని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

Apr 12 2025 2:48 AM | Updated on Apr 12 2025 2:48 AM

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

నకిరేకల్‌ : రాజ్యంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్సీ శంకర్‌నాయర్‌, ఎమ్మెల్యే వేముల వీరేశంలు పిలుపునిచ్చారు. జై బాపు – జై భీమ్‌ – జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నకిరకల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యంగ పరిపరిక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యంగ నిర్మాణంలో చేసిన విశేష కృషిని గౌరవించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గాంధీ శాంతి సందేశం, అంబేద్కర్‌ సామాజిక న్యాయ పోరాటం, రాజ్యంగ విలువలను ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ శత్రు, మార్కెట్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్‌, పూజర్ల శంభయ్య, చామల శ్రీని వాస్‌, గాజుల సుకన్య, నకిరెకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, బత్తుల ఉశయ్య, దూదిమెట్ల సత్త య్య, పెద్ది సుక్కయ్య, సుంకరబోయిన నర్సింహ, మల్లారెడ్డి, కంపసాటి శ్రీనివాస్‌, కోట మల్లి కార్జున్‌, లక్ష్మీనర్సు, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్‌, యాసా కరుణాకర్‌రెడ్డి, పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌,

ఎమ్మెల్యే వీరేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement