
‘ప్రత్యేక’ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి
నాకు రోడ్డు ప్రమాదం కారణంగా వెన్నుపూస దెబ్బతిని ఆపరేషన్లు అయ్యాయి. ఎలాంటి పని చేయలేని పరిస్థితి. నేను చాలా నిరుపేదను. ఇల్లు కూడా లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి. మూడు చక్రాల వాహనం మంజూరు చేయాలి.
– దోమలపల్లి వెంకన్న, మాడ్గులపల్లి
నల్లగొండ : ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్తో ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు ఎక్కువగా పిల్లలు భూములు పట్టాలు చేయించుకుని తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు చేయగా మరికొందరు పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సోమ, మంగళవారాల్లో వారి సంబంధీకులను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని సంబంధిత అధికారుల ద్వారా కౌన్సిలింగ్కు తేదీలను ఖరారు చేశారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి

‘ప్రత్యేక’ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి