
పెండింగ్లో ఉన్నవాటికి మోక్షం..
ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్అండ్బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి.