ఉపాధి కూలీలకు బీమా | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు బీమా

Jul 20 2025 5:32 AM | Updated on Jul 20 2025 5:32 AM

ఉపాధి కూలీలకు బీమా

ఉపాధి కూలీలకు బీమా

నిరంతరం ప్రక్రియ..

ఉపాధి కూలీలకు బీమా అనేది నిరంతరం ప్రక్రియ దీనికి చివరి తేదీ అంటూ ఏమీ లేదు. జిల్లాలో ఎవరెవరికి బీమా లేదన్న విషయాన్ని బ్యాంకుల వద్ద సేకరించి వారికి బీమా కల్పించేలా ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశా ం. ప్రతి ఒక్కరికి బీమా కల్పించడమే లక్ష్యంగా కూలీలకు సైతం అవగాహన కల్పిస్తున్నాం.

– ఓబులేసు, డీఆర్‌డీఓ

నాగర్‌కర్నూల్‌: గ్రామాల్లో వలసలు నివారించి ప్రతిఒక్కరికీ స్థానికంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కూలీ ఉపాధి పొందుతుండగా వారికి మరో ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి సురక్ష పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. కూలీలతో కొంత ప్రీమియం సొమ్ము చెల్లింపజేసి వారికి బీమాను కల్పించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి హామీలో ఉన్న కూలీలకు ఎవరెవరికి బీమా ఉంది.. లేనివారితో చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు జిల్లాలో కూలీలకు ఎవరెవరికి బీమా లేదనే వివరాలను సేకరించి వారిని బీమా చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు.

జిల్లాలో మొత్తం 1,11,181 యాక్టివ్‌ జాబ్‌ కార్డులు ఉండగా.. ఇందులో 1,69,870 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరందరికి ఈ బీమా వర్తించనుంది. సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 71 ఏళ్లలోపు వారు జాతీయ బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌లో ఖాతా నుంచి ఏటా రూ.20 బీమాకు జమ చేయాలని అంగీకార పత్రం ఇవ్వాలి. పేరు నమోదు చేసుకున్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా.. పూర్తి అంగవైకల్యం కలిగినా వారికి రూ.2 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. పాక్షికంగా అంగవైకల్యం కలిగిన రూ.లక్ష పరిహారం అందుతుంది. అయితే కూలీలకు బీమా చెల్లింపు సమస్యగా మారింది. కచ్చితంగా బ్యాంకుకు వెళ్లి నమోదు చేసుకోవాలి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులు దూరంగా ఉండడంతో నిరక్షరాస్యులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలామంది కూలీలు తమ వేతనాలను సీఎస్సీ కేంద్రాల ద్వారా తీసుకుంటారు. కాగా బీమా పొందాలంటే వేతనదారుడి ఇంటి పేరుతోపాటు తండ్రి, భర్త, వయస్సు, బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేయాలి. వేతనదారుల నుంచి ఉపాధి సిబ్బంది అనుమతి పత్రం సేకరించి బ్యాంకుల్లో అందజేయాలి. ప్రతిరోజు పథకం కింద నమోదైన వివరాలు జిల్లా ఉపాధి కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. కాగా వందశాతం కూలీలకు ఈ బీమా సౌకర్యం కల్పించేలా ఉపాధి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రధానమంత్రి సురక్ష యోజన అమలు

బీమా లేని వారిని గుర్తించే

పనిలో అధికారులు

వందశాతం సౌకర్యం

కల్పించేందుకు చర్యలు

జిల్లాలో 1,69,870 మంది కూలీలు

ఖాతా నుంచి రూ.20 జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement