
రైతులకు విద్యుత్ సమస్యలు ఉండొద్దు
కొల్లాపూర్: రైతులకు విద్యుత్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో విద్యుత్శాఖ అధికారులతో మంత్రి సమావేశమై.. కొల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ కనెక్షన్లు, స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కరెంటు సౌకర్యం కల్పించాలన్నారు. లోఓల్టేజీ సమస్య ఏర్పడకుండా అవసరమైన మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, కొల్లాపూర్లోని వంద పడకల ఆస్పత్రిలో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతుండటంతో డయాలసిస్ పేషెంట్లు, ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. మల్లేశ్వరంలో కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటుచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖ్ అలీ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు