విద్యార్థుల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెంచాలి

Jun 18 2025 3:11 AM | Updated on Jun 18 2025 3:11 AM

విద్య

విద్యార్థుల సంఖ్య పెంచాలి

తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి నాణ్యమైన విద్య అందించాలని డీఈఓ రమేష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని కార్వంగ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో నమోదైన విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. తరగతికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గకూడదని సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను చేర్పించడంతో ఉపాధ్యాయులను అభినందించారు.

డయాలసిస్‌ సేవలువినియోగించుకోవాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులు జనరల్‌ ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్‌ సేవలు వినియోగించుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రఘు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్‌ ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్‌ సేవలు ప్రస్తుతం 46 మంది వినియోగించుకుంటున్నారని, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూడు విడతల్లో డయాలసిస్‌ ఆరోగ్య సేవలు చేస్తున్నామన్నారు. ఇంకా ఖాళీగా ఉన్న పది మంది రోగులకు సేవలు అందించడానికి అవకాశం ఉందన్నారు. హెపటైటిస్‌ సీ పాజిటివ్‌ ఉన్న రోగులు కూడా ఈ సేవలు పొందవచ్చన్నారు. డయాలసిస్‌ ఆరోగ్య సేవల కోసం నేరుగా జనరల్‌ ఆస్పత్రిలో అన్ని రకాల రిపోర్టులు, ఆధార్‌, రేషన్‌, ఇతర ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాల కోసం డయాలసిస్‌ ఇన్‌చార్జ్‌ వినోద్‌ కుమార్‌ (81858 08145), హెల్ప్‌ డెస్క్‌ ఇన్‌చార్జ్‌ యాదగిరి (90149 32408)లను సంప్రదించాలని సూచించారు.

యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ప్రవీణ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఆమె ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. యోగా దినోత్సవం రోజు నిర్వహించే అంతర్జాతీయ వెబినార్‌లో పెద్ద ఎత్తున ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యోగా ప్రాధాన్యత, ఆరోగ్యం తదితర వివరాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అర్జున్‌కుమార్‌, రవికుమార్‌, రాఘవేందర్‌, శివకుమార్‌, గాలెన్న, ఈశ్వర్‌, చిన్నదేవి తదితరులు పాల్గొన్నారు.

రేపు జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నిజామాబాద్‌లో ఈనెల 28 నుంచి జూలై 1 వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలుర జూనియర్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను ఈనెల 19న ఉదయం 8 గంటలకు స్థానిక మెయిన్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో వనపర్తి జిల్లా మినహా పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌, రెండు పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలతో రావాలని కోరా రు. మిగతా వివరాల కోసం 93964 39663 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

విద్యార్థుల సంఖ్య పెంచాలి 
1
1/1

విద్యార్థుల సంఖ్య పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement