
కాంగ్రెస్తోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యం
కొల్లాపూర్ రూరల్: దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని ముక్కిడిగండం గ్రామం నుంచి మొలచింతలపల్లి వరకు నిర్వహించిన జైభీమ్– జైబాపు యాత్రలో మంత్రి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహలకు పాలాభిషేకాలు చేసి.. ఘనంగా నివాళలర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే జైభీమ్– జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వాటిని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అందరికీ సమాన హక్కులు, అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు. పాదయాత్రలో భాగంగా మొలచింతపల్లి గ్రామానికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు దశాబ్దాల కాలంగా సాగునీరు లేక ముక్కిడిగుండం, మొలచింతపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చెంతనే కేఎల్ఐ ప్రాజెక్టు ఉన్నా సాగునీరు అందడం లేదని సీపీఐ మండల కార్యదర్శి శివుడు ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని మంత్రి సమక్షంలోనే పేర్కొన్నారు.