ఘనంగా పండుగ సాయన్న జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పండుగ సాయన్న జయంతి

Jul 30 2023 12:54 AM | Updated on Jul 30 2023 12:54 AM

పండుగ సాయన్న చిత్రపటానికి 
నివాళులర్పిస్తున్న నాయకులు  - Sakshi

పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

కందనూలు: జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ అత్యంత ధీరునిగా, సాహసవంతునిగా ఎదిగిన సాయన్న చిన్ననాటి నుంచి అన్యాయాలను ఎదిరించి, పేదల పక్షాన నిలబడ్డాడని కొనియాడారు. అంతేకాకుండా ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములకు ఎదురు తిరిగి అక్రమంగా దోచుకున్న ధాన్యాన్ని, ధనాన్ని తన దగ్గర దాచుకోకుండా పేదలకు పంచి పెట్టిన వీరుడు అని కొనియాడారు. కార్యక్రమంలో పెబ్బేటి మల్లికార్జున్‌, డైరెక్టర్‌ సహదేవుడు, పంచాయతీ కార్యదర్శి మహేష్‌, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మయ్య, నిరంజన్‌, తెలుగోల్ల భవన సాధన నాయకులు శివయ్య, చెన్నకేశవులు, వెంకటయ్య, శ్రీశైలం, శోభన్‌, రాములు, రాజు, కుర్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement