‘సికిల్‌సెల్‌’తో అనారోగ్యం | - | Sakshi
Sakshi News home page

‘సికిల్‌సెల్‌’తో అనారోగ్యం

Jun 20 2025 6:33 AM | Updated on Jun 20 2025 6:33 AM

‘సికిల్‌సెల్‌’తో అనారోగ్యం

‘సికిల్‌సెల్‌’తో అనారోగ్యం

ములుగు రూరల్‌: సికిల్‌ సెల్‌ వ్యాధిగ్రస్తులు రక్తహీనతతో తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుందని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ సికిల్‌ సెల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సికిల్‌ సెల్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా సికిల్‌ సెల్‌ను గుర్తించవచ్చన్నారు. సికిల్‌ సెల్‌ జన్యు సంబంధమైన వ్యాధి అన్నారు. వ్యాధిగ్రస్తులకు దృష్టిలోపం, కీళ్ల నొప్పులు, చాతి నోప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. పోషకాహార సమతుల్యత, వైద్యుల పర్యవేక్షణ, శారీరక శ్రమతో నియంత్రించవచ్చని వివరించారు. జిల్లాలో 22,392 మందికి వైద్య పరీక్షల కార్డులను అందించినట్లు వెల్లడించారు. అందులో 15 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీహెచ్‌ జగదీశ్‌, ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్‌, పవన్‌కుమార్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు కృషి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు కోరారు. మండలంలోని పడిగాపూర్‌, ఎల్బాక గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన సందర్శించారు. గ్రామాల్లో సిబ్బందితో కలిసి ఇంటింటిని పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి పరిసరాల్లో, రోడ్లపై నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. దోమతెరలను వినియోగించడంతో పాటు మస్కుటోకాయల్స్‌ వాడాలన్నారు. నీటి నిల్వల్లో ఆయిల్‌ బాల్‌ వేయాలని కార్యదర్శి ధర్మేందర్‌కు సూచించారు. డీఎంహెచ్‌ఓ వెంట వైద్యాధికారి పవన్‌ కుమార్‌, డీఎంఓ సంపత్‌, ఏఎంఓ దుర్గారావు, మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వెంకట్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ పద్మ, ఫార్మసిస్టు వెంకట్‌, ఆశలు ఉన్నారు.

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement