మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Jun 20 2025 6:33 AM | Updated on Jun 20 2025 6:33 AM

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ములుగు రూరల్‌: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో కుట్టుమిషన్‌ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, ధ్రువపత్రాలను మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం కుట్టే పనితో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. 15నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని సూచించారు. మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంక్‌లు, ఇందిరా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలలో చేరిన చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి తుల రవి, డీఎస్పీ రవీందర్‌, ట్రైబల్‌ వెల్పేర్‌ డీడీ పోచం, ఎంపీడీ రామకృష్ణ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం అధికారి రమాదేవి, డీసీపీఓ ఓంకార్‌, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి పొట్లాపూర్‌ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు అంచనా విలువ రూ.19 కోట్లతో రోడ్డు వెడల్పు, పటిష్ట పరిచేందుకు నిధులు కేటాయించినట్లు సీతక్క వివరించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన

మండల పరిధిలోని బండారుపల్లి పీఎం శ్రీ మోడల్‌ స్కూల్‌లో కంప్యూటర్‌ ల్యాబ్‌ను కలెక్టర్‌ దివాకరతో కలిసి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాబుద్దులతో పాటు సంస్కారం నేర్చుకోవాలన్నారు. గత సంవత్సర కాలంలో పలు కంపెనీల సహకారంతో పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యాబోధన చేయడానికి అవకాశాలను మెరుగుపరచామని తెలిపారు. అనంతరం మంత్రి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ దేవకి, ఎంఈఓ తిరుపతి, సైన్స్‌ అధికారి జయదేవ్‌, కో ఆరి ్డనేటర్‌ రాజు, సాంబయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ

మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement