ఆంధ్రా గో బ్యాక్.. ఫిలిం ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత | Tension at Telugu Film Chamber in hyderabad | Sakshi
Sakshi News home page

Telugu Film Chamber: ఆంధ్రా గో బ్యాక్.. ఫిలిం ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Jul 29 2025 2:34 PM | Updated on Jul 29 2025 3:08 PM

Tension at Telugu Film Chamber in hyderabad

తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు తెలంగాణ వాదులు యత్నించారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో పాశం యాదగిరి గొడవకు దిగారు, ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్‌ వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది.

ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చిన తెలంగాణ వాదులు.. ఛాంబర్లో సినారె ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement