మూడేళ్లుగా పరారీలో హీరోయిన్‌.. అరెస్ట్‌ చేయాలని కోర్టు నోటీసులు | Madras Court Latest Orders Issued To Arrest Actress Meera Mithun, More Details Inside | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా పరారీలో హీరోయిన్‌.. అరెస్ట్‌ చేయాలని కోర్టు సూచన

Aug 5 2025 7:26 AM | Updated on Aug 5 2025 9:36 AM

Madras Court Latest Orders Issued To Meera mithun

సినిమాలకంటే వివాదాలతో పాపులర్‌ అయిపోయింది తమిళ హీరోయిన్ మీరా మిథున్. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ గతంలో వైరల్అయ్యేది.. అయితే, ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెన్నై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు మూడేళ్ల క్రితం దళితుల గురించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు సమయంలో పెద్ద దుమారాన్నే రేపాయి. వివాదంలో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్‌ అభిషేక్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి 2022లోనే అరెస్టు చేశారు. అయితే, బెయిల్పై వారిద్దరూ బయటకు వచ్చేశారు. కేసు విచారణకు వారు సహకరించకపోవడంతో అరెస్ట్వారెంట్ సమయంలోనే జారీ అయింది. ఇప్పటికే మూడేళ్లు అవుతున్నా ఆమె పరారీలోనే ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోయారు.

ఢిల్లీ వీధుల్లో మీరా మిథున్
ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న తన కూతురు మీరా మిథున్ను కాపాడాలని ఆమె తల్లి ఒక పిటిషన్దాఖలు చేసింది. దీంతో ఆమె గురించి తెలిసింది. మీరా తల్లి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మీరాను రక్షించాలని పోలీసులను సూచించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెను గుర్తించి అక్కడున్న హోంకి తరలించారు. అయితే, ఆమెను ఈనెల 11 చెన్నై న్యాయస్థానంలో హజరుపరచాలని కోర్టు తెలిపింది. మీరా మిథున్అనునిత్యం వివాదాలతోనే ఉంటుంది. ఆమె బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమెను అరెస్ట్చేసేందుకు పోలీసులు వెళ్లారు. విశాల్‌, త్రిష, రజనీకాంత్‌, విజయ్వంటి స్టార్స్పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement