ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్ | Keerthi Bhat Emotional Interview ABout Her Life Secrets | Sakshi
Sakshi News home page

Keerthi Bhat: దారుణమైన అనుభవాల్ని గుర్తు చేసుకున్న 'బిగ్‌‌‌బాస్' కీర్తి

Apr 27 2024 9:58 AM | Updated on Apr 27 2024 1:04 PM

Keerthi Bhat Emotional Interview ABout Her Life Secrets

బిగ్ బాస్ షోతో చాలామంది పేరు తెచ్చుకున్నారు. అలా ఆరో సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి కీర్తి భట్. పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్నాళ్లు కోమాలో ఉండి, తిరిగి కోలుకుంది. రీసెంట్‌గానే ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ  బ్యూటీ.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే జంటగా ఓ ఇంటర్వ్యూకి వచ్చింది. తనకు జరిగిన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది.

స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన కీర్తి భట్.. 2019లో 'మనసిచ్చి చూడు' అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'కార్తీకదీపం'లోనూ నటించింది. 2022లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ప్రస్తుతం 'మధురానగరిలో' సీరియల్ చేస్తోంది. 2017లో కీర్తి భట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవగా.. ఈమె తల్లిదండ్రులు, అన్న-వదిన మృత్యువాతపడ్డారు. అదృష్టం బాగుండి కీర్తి ప్రాణాలతో బయటపడింది. కానీ కొన్నాళ్ల పాటు కోమాలో ఉండి వచ్చింది. అప్పుడే దారుణమైన సంఘటనలు జరిగాయని కీర్తి చెప్పుకొచ్చింది.

'ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగళూరు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. తెలుస‍్తుంది కానీ స్పర్మ లేకపోవడం వల్ల నెట్టేయడానికి కూడా బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే.. '200 ఇస్తా వస్తావా' అంటే సరే వస్తానని అనేదాన్ని. తర్వాత వాళ్ల లుక్ చూసి అర్థమయ్యేది' అని కీర్తి భట్ తనకెదురైన దారుణాల్ని బయటపెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement