Amy Jackson: అమలాపాల్‌ మాజీ భర్త డైరెక్షన్‌లో.. అమీ జాక్సన్‌ రీఎంట్రీ

Amy Jackson To Make Comeback To Tamil Cinema - Sakshi

హీరోయిన్‌ అమీ జాక్సన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈత దుస్తులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన లండన్‌కు చెందిన నటి ఈ బ్యటీని మద్రాసు పట్టణం చిత్రంతో దర్శకుడు ఎఎల్‌ విజయ్‌ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. తొలి చిత్రంలోని బ్రిటీష్‌ బ్యూటీగా తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించింది. తెలుగులోనూ రామ్‌చరణ్‌కు జంటగా ఎవడు చిత్రంలో సందడి చేసింది. ఈమె కోలీవుడ్‌లో చివరగా తెరపై కనిపింన చిత్రం 2.0. ఇందులో రజనీకాంత్‌కు జంటగా నటింంది. అయితే అంతకుముందే హిందీలో ఏక్‌ దివానా థా చిత్రంలో నటించి ఆ చిత్ర కథానాయకుడు ప్రతీక్‌ ప్రేమలో పడింది. అయితే కొద్ది రోజులకే ఇద్దరూ విడిపోయారు.

ఆ తరువాత హాలీవుడ్‌ టీవీ సీరియల్‌పై దృష్టి సారించిన ఎమీ జాక్సన్‌ జార్జ్‌ పనమిట్‌ అనే వ్యక్తి ప్రేమలో పడింది. పెళ్లికి ముందే సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అతనితో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన ఎమీ జాక్సన్‌ తరువాత ఏమైందో గాని అతనికి దూరమైంది. ప్రస్తుతం కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేస్తున్న ఈమె త్వరలో కోలీవుడ్‌ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ అమ్మడిని మద్రాసు పట్టణం చిత్రంతో పరిచయం చేసిన దర్శకుడు ఎఎల్‌ విజయ్, మళ్లీ తన తాజా చిత్రంలో కథానాయికగా నటింపచేస్తున్నట్లు తెలిసింది. ఈయన ప్రస్తుతం నటుడు అరుణ్‌ విజయ్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. కాగా దీనికి సంబంధింన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top