
సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు మనలానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే తమకు ఫలానా వ్యాధి ఉందని చెబుతుంటారు. రెండుమూడేళ్ల క్రితం హీరోయిన్ సమంత (Samantha) కూడా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పింది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాసిని (Suhasini) కూడా తనకున్న అనారోగ్య సమస్యలు గురించి బయటపెట్టింది.
తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన సుహాసిని.. ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగానూ పలు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తనకు టీబీ (TB Disease) ఉందనే విషయాన్ని రివీల్ చేశారు. పరువు పోతుందనే భయంతో దీని గురించి దాచిపెట్టానని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఎన్టీఆర్ లవ్లీ పోస్ట్)
'నాకున్న జబ్బుని నేను సీక్రెట్గా ఉంచాను. పరువు పోతుందని భయపడ్డాను. ఎవ్వరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను. కొన్నాళ్ల తర్వాత దీని గురించి బయటపెట్టి, అందరికీ టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను' అని సుహాసిని చెప్పుకొచ్చారు.
తమిళనాడుకు చెందిన సుహాసిని 1980లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1988లో దర్శకుడు మణిరత్నంని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. ఈమెకు చిన్నాన్న అవుతాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)