
హస్తం హవా కొనసాగాలి
ఉమ్మడి జిల్లా నేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్
సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో హస్తం హవా కొనసాగాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, టీపీసీసీ మెదక్ ఇన్చార్జి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులతో హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన గుర్తింపునివ్వాలని చెప్పారు. కష్టకాలంలో జెండా మోసిన వారితో, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. సమావేశానికి సంగారెడ్డి నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు రూ.20లక్షల రుణాలు
డీసీసీబీ మేనేజర్ కిషన్
పాపన్నపేట(మెదక్): మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందజేసినట్లు డీసీసీబీ మేనేజర్ కిషన్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేటలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని కోరారు. బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు స్వదేశి, విదేశి విద్య, వాహన, రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. లాకర్ సదుపాయం కూడా ఉందన్నారు.
వన దుర్గమ్మ సేవలోఆర్టీఐ కార్యదర్శులు
పాపన్నపేట(మెదక్): సమాచార హక్కు చట్టం కార్యదర్శులు మంగళవారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీఐ కార్యదర్శి రాములు, డిప్యుటీ కార్యదర్శి ప్రమీల, సభ్యులు ఉదయం ఏడుపాయలకు రాగా వారికి సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు శంకరశర్మ,పార్థివ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆర్టీఐ అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.
ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలి
గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా
అధ్యక్షుడు జైపాల్ నాయక్
మెదక్ కలెక్టరేట్: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014కు పూర్వం సమైక్యాంధ్ర ప్రదేశ్లో గిరిజనులకు 6% లభించే రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10% పెరిగినట్లు తెలిపారు. రాష్ట్ర గిరిజన జనాభాలో 70% మైదాన ప్రాంతాలైన మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్లో గిరిజనులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్నారు.
ఓడీఎఫ్లోవర్క్లోడ్ సమస్య తీర్చాలి
కంది(సంగారెడ్డి): ఎద్దు మైలారం అయిద కర్మగారం(ఓడీఎఫ్)లో వర్క్లోడ్ సమస్యను తీ ర్చాలని బీఎంఎస్, ఓఎఫ్ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఎంపీ రఘునందన్రావు ఆధ్వర్యంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓడీఎఫ్లో వర్క్లోడ్ లేక ఉద్యోగులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు భూమి, రైల్వే, సోలా ర్ తదితర సౌకర్యాలు ఓడీఎఫ్లో ఉన్నాయని తెలిపారు. ఓడీఎఫ్కు బీఎంపీ 3 వర్షన్ వర్క్లోడ్ కల్పించాలన్నారు. సీనియర్ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నందునా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.