8,229 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

8,229 దరఖాస్తులు

Jun 22 2025 7:18 AM | Updated on Jun 22 2025 7:18 AM

8,229 దరఖాస్తులు

8,229 దరఖాస్తులు

తూప్రాన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు శనివారంతో ముగిసినట్లు ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లో భూ సమస్యలపై 8,229 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణం, పేరు సవరణ, పెండింగ్‌ మ్యుటేషన్‌, ఫౌతి (విరాసత్‌), డిజిటల్‌ సంతకం పెండింగ్‌, సాదాబైనామా, పీఓటీ, కుటుంబ తగాదాలతో పాటు ఇతర భూ సమస్యలకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వాటిని పరిశీలించి భూ సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. సాదాబైనామా, పీఓటీ దరఖాస్తులను ప్రభుత్వం ఇచ్చే సూచనల మేరకు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు, గ్రామ ప్రజల సహకారంతోనే రెవెన్యూ సదస్సులు సజావుగా, ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు.

ఆర్డీఓ జయచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement