ట్రాక్‌ తప్పకుండా.. | - | Sakshi
Sakshi News home page

ట్రాక్‌ తప్పకుండా..

Jun 22 2025 7:18 AM | Updated on Jun 22 2025 7:18 AM

ట్రాక

ట్రాక్‌ తప్పకుండా..

రైల్వే ప్రభావిత చెరువులకు మరమ్మతులు
● జిల్లాలో 37 చెరువు, కుంటల గుర్తింపు ● కట్టల బలోపేతానికిరూ. 2 కోట్లు విడుదల

మరమ్మతులు చేస్తున్నాం

జిల్లాలో 37 రైల్వే ప్రభావిత ట్యాంకులను గుర్తించాం. అందులో 30 ట్యాంకుల కట్టల బలోపేతానికి రూ. 2 కోట్లు మంజూరు కాగా, 27 నీటి వనరులకు మరమ్మతులు చేస్తున్నాం. అలాగే గతేడాది దెబ్బతిన్న 26 చెరువు, కుంటల పనలు పూర్తి చేశాం.

– శ్రీనివాస్‌రావు, మెదక్‌ ఇరిగేషన్‌ ఈఈ

రైలు మార్గంలో ట్రాక్‌ను ప్రభావితం చేసే చెరువులు, కుంటల బలోపేతానికి రైల్వే, ఇరిగేషన్‌ శాఖల అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఈ ఏడాది 30 నీటి వనరులకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 2 కోట్లు మంజూరు కాగా, ముమ్మరంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఇప్పటివరకు 27 చెరువు, కుంటల పనులు కొనసాగుతుండగా, మరో 3 నీటి వనరులు టెండర్‌ దశలో ఉన్నాయి. నిర్మాణాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.

– మెదక్‌జోన్‌

జిల్లాలోని పలు మండలాల పరిధిలో రైల్వేట్రాక్‌ పైభాగంలో 37 చెరువులు, కుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వర్షాకాలంలో ఇవి ప్రమాదవశాత్తు తెగిపోతే దిగువ భాగంలో ఉన్న రైల్వేట్రాక్‌ (పట్టాలు) కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 37 నీటి వనరులను గుర్తించి, అందులో 30 చెరువు, కుంటల కట్టలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 2 కోట్లు మంజూరు కాగా, ఇరిగేషన్‌ అధికారులు టెండర్‌ పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. 27 చెరువు, కుంటల పనులు కొనసాగుతుండగా, మరో 3 నీటి వనరులు టెండర్‌ దశలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. నిర్మాణాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.

గతేడాది దెబ్బతిన్న చెరువులకు సైతం..

గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 27 చెరువు, కుంటలు దెబ్బతిన్నాయి. కాగా అప్పట్లో ఇరిగేషన్‌ అధికారులు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో హవేళిఘణాపూర్‌ పెద్ద చెరువు తూము దెబ్బతిని, ఆయకట్టు వెనకాల సాగు చేసిన పంటలు కొంతమేర కొట్టుకుపోయాయి. ఆ చెరువులకు సైతం రూ. 40 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేశారు. కలెక్టర్‌ ఫండ్‌ నుంచి సైతం రూ. 25 లక్షలు మంజూరయ్యాయి.

ట్రాక్‌ తప్పకుండా.. 1
1/1

ట్రాక్‌ తప్పకుండా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement